కేసీఆర్ ఒక్క గిఫ్ట్‌కు‌‌ మేం మూడు గిఫ్ట్‌లు ఇస్తాం..

కేసీఆర్ ఒక్క గిఫ్ట్‌కు‌‌ మేం మూడు గిఫ్ట్‌లు ఇస్తాం..
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఒక రిటర్న్ గిఫ్ట్ కు మూడు గిప్టులు ఇస్తామన్నారు. గిఫ్ట్ కోసం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కేసీఆర్ ఎంచుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఒక రిటర్న్ గిఫ్ట్ కు మూడు గిప్టులు ఇస్తామన్నారు. గిఫ్ట్ కోసం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కేసీఆర్ ఎంచుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీ రాష్ట్రంపై జరిగే దాడిని ప్రతిఒక్కరు తిప్పికొట్టాలని ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తామేమి చేతకానివారం కాదని హెచ్చరించారు. ఏపీతో భారత ప్రధాని నరేంద్రమోడీ కలిసి ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ మంచిగానే ఉన్నారని ఎప్పుడైతే ఎన్డీయే నుండి బయటకు వచ్చమో అప్పటి నుండి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. శుక్రవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తనకు బహుమతి ఇవ్వడానికి వాళ్ల తమ్ముడు, అవినీతిపరుడు వైయస్ జగన్ మోహన్ రెడ్గి కోడికత్తి పార్టీని ఏర్పాటు చేసుకున్నాడని అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసి తనను ఏమీ చేయలేరని అన్నారు. ఈ రాష్ట్రాన్నిఏమీ చేయలేరు మాదీ దృడ సంకల్పం, ఉక్కు సంకల్నం, వెనక్కి వచ్చే ప్రసక్తే లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories