కాసేపట్లో ఢిల్లీకి చంద్రబాబు.. అందుకేనా..

కాసేపట్లో ఢిల్లీకి చంద్రబాబు.. అందుకేనా..
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం 4:30కి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ...

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం 4:30కి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఏపీలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఐదు బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరం తెలపనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనన్న చంద్రబాబు బీజేపీయేతర పార్టీల నేతలో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాహుల్‌ గాంధీ, శరద్‌ పవార్‌, శరద్‌యాదవ్‌, ఫరూక్‌ అబ్దుల్లా సహా పలువురు నేతలను చంద్రబాబు కలవనున్నారు. . ఢిల్లీ నుంచి చంద్రబాబు లఖ్‌నవూ వెళ్లి మాయావతితో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 23న ఫలితాల తర్వాత కార్యాచరణపై చర్చ జరగనుంది. ఫలితాలు వెల్లడయ్యాక తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories