నన్ను తిట్టడానికే ఢిల్లీ నుంచి వచ్చారు: చంద్రబాబు

నన్ను తిట్టడానికే ఢిల్లీ నుంచి వచ్చారు: చంద్రబాబు
x
Highlights

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను తిట్టడానికే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏపీకి మోదీ తీరని...

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను తిట్టడానికే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏపీకి మోదీ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. తల్లిని చంపి బిడ్డను కాపాడారని గతంలో కాంగ్రెస్ ను మోదీ విమర్శించారని ఇప్పుడు బీజేపీ కూడా తల్లికి అన్యాయమే చేసిందని చెప్పారు. మోదీ రాకపై నిరసన తెలపాలనే తాను నల్ల చొక్కా ధరించానని తెలిపారు. విజయవాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎదుటి వ్యక్తిని తిట్టడం చాలా సులువని పని చేయడం కష్టమని చంద్రబాబు అన్నారు. విభజన కారణంగా అయిన పుండుపై మోదీ కారం చల్లుతున్నారని మండిపడ్డారు. మీరు చేసిన దారుణం సహించలేకే ఆంధ్రులంతా రోడ్డెక్కి నిరసన చేస్తున్నారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories