ఫామ్‌-7పై స్పష్టత ఇచ్చిన ఏపీ సీఈవో ద్వివేది

ఫామ్‌-7పై స్పష్టత ఇచ్చిన ఏపీ సీఈవో ద్వివేది
x
Highlights

జనవరి 11 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఓటు కూడా తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది స్పష్టంచేశారు. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన...

జనవరి 11 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఓటు కూడా తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది స్పష్టంచేశారు. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ద్వివేది ఫామ్-7 అనేది దరఖాస్తు మాత్రమేనన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్లు కాదని తెలిపారు. పోలీసు కేసులు మొదలుకాగానే నకిలీ దరఖాస్తులు ఆగిపోయాయన్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో పార్టీల వైఖరిని ఆయన తప్పుపట్టారు. ప్రజల్ని గందరగోళానికి గురిచేసే ప్రకటనలు సరికాదని హితవుపలికారు. ఓట్లు ఎక్కడ తొలగించారో నిరూపించాలని సవాల్ విసిరారు. ఏపీలో జనాభా కంటే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉందన్నారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories