పంతం నెగ్గింది.. నేటి మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ

పంతం నెగ్గింది.. నేటి మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ
x
Highlights

ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీకానుంది. చంద్రబాబు అధ్యక్షత జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు. నీటి ఎద్దడి,...

ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీకానుంది. చంద్రబాబు అధ్యక్షత జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు. నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత, ఫోని తుఫాను సహాయ, పునరావాస చర్యలు, ఉపాధి హామీ పనులకు నిధుల చెల్లింపు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే, విధానపరమైన నిర్ణయాల జోలికి వెళ్లకుండా అవసరమైన సూచనలకు మాత్రమే కేబినెట్ భేటీ పరిమితంకానుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు పంతం నెగ్గింది. కేబినెట్‌ మీటింగ్‌పై కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది. అసలు జరుగుతుందా? లేదా? అంటూ సస్పెన్స్ క్రియేట్‌ చేసిన మంత్రివర్గ సమావేశానికి కేంద్రం ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ భేటీకి సంబంధించి ప్రభుత్వం పంపిన ఎజెండాలోని అంశాలకు కూడా ఈసీ ఆమోదం తెలిపింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories