చంద్రబాబు మళ్లీ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు

చంద్రబాబు మళ్లీ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు
x
Highlights

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థం కోసం మరోసారి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గతంలో మాల,...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థం కోసం మరోసారి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గతంలో మాల, మాదిగల మధ్య అలాగే కాపు, బీసీల మధ్య గొడవ పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్న కన్నా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంలో కేంద్రం 10 శాతం కోటా తీసుకొస్తే దాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్‌లు ఇస్తామని చెప్పిన బాబు కమిటీలతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories