నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
x
Highlights

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త ప్రభుత్వంలో మొదటి సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదురోజుల పాటు జరగనున్న అసెంబ్లీ...

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త ప్రభుత్వంలో మొదటి సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదురోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు... ఈ ఉదయం 11.05 నిమిషాలకు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా నేడు.. ప్రొటెం స్పీకర్‌ అప్పలనాచుడు... ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎల్లుండి స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను శాసనసభ ఎన్నుకోనుంది. ఇదిలా ఉంటే... ఈ సమావేశాల్లో ఈనెల 14న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. ఈనెల 15, 16 తేదీల్లో సభకు సెలవు ఉంటుంది. ఇక 17, 18వ తేదీన సమావేశాలు యధావిధిగా జరుగుతాయి. 18వ తేదీలో ఈ సమావేశాలు ముగియనున్నాయి. తిరిగి జూలైలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories