టీడీపీకీ షాక్.. మరో కీలక నేత రాజీనామా..

టీడీపీకీ షాక్.. మరో కీలక నేత రాజీనామా..
x
Highlights

ఎపీలో ఎన్నికల వేళ వలసలతో మరింత హీట్ పెంచుతోంది. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీలలో జోరుగా వలసలు ఊపందుకుంటున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ...

ఎపీలో ఎన్నికల వేళ వలసలతో మరింత హీట్ పెంచుతోంది. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీలలో జోరుగా వలసలు ఊపందుకుంటున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బతగిలింది. నియోజకవర్గ సమన్వయకర్త, తెలుగు యువత మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెజవాడ గోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. కాగా గోపాలకృష్ణతో పాటు ఇద్దరు మాజీ సర్పంచులు, ఎంపీటీసీ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. కాగా ఈ సందర్భంగా బెజవాడ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పార్టీకి నమ్ముకున్న వారికి పార్టీలో గుర్తింపు లేదని ఆవేధన వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీలో ఒకవర్గానికే ప్రాధాన్యత ఇస్తూ మరో వర్గాన్ని మాత్రం చిన్న చూపు చూస్తున్నరని మండిపడ్డారు. అసలు టీడీపీ పార్టీలో ఎక్కడ చూసినా కానీ అవినీతే విచ్ఛలవిడిగా కనిపిస్తోందని ఆరోపించారు. సోమవారం వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుమారు మూడు వేలమందితో వైసీపీ పార్టీలో చేరుతున్నామని గోపాలకృష్ణ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories