2100 మంది రైతుల అప్పులు తీర్చిన అమితాబ్

2100 మంది రైతుల అప్పులు తీర్చిన అమితాబ్
x
Highlights

తన మాటను నిలబెట్టుకున్నారు బిగ్ బీ అమితాబ్. బిహార్ కు చెందిన రైతుల అప్పులను తీరుస్తానని మాట ఇచ్చిన అమితాబ్ నేను మాటను నిలబెట్టుకున్నానంటూ తన బ్లాగ్ లో...

తన మాటను నిలబెట్టుకున్నారు బిగ్ బీ అమితాబ్. బిహార్ కు చెందిన రైతుల అప్పులను తీరుస్తానని మాట ఇచ్చిన అమితాబ్ నేను మాటను నిలబెట్టుకున్నానంటూ తన బ్లాగ్ లో ప్రకటించారు. బిహార్ కు చెందిన ఎంపిక చేసిన 2100 మంది రైతుల రుణాలను అమితాబచ్చన్ తీర్చేశారు.


'నేను ముందుగా ప్రామిస్‌ చేసినట్లుగానే బిహార్‌కు చెందిన 2100 రైతులను ఎంపికచేసి వారి అప్పులను తీర్చేశాను. కొందరి అప్పులను నేరుగా బ్యాంకుల్లోనే వేసేశాను. మరికొందరిని నా నివాసానికి పిలిపించి అభిషేక్‌, శ్వేత చేత చెక్కులు అందించాను' అని అమితాబ్ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రైతులతో తానూ, అభిషేక్, శ్వేత ఉన్న ఫోటోలను ఉంచారు బిగ్ బీ.

అమితాబ్ ఇలా చేయడం ఇది రెండోసారి. గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ కు చెందిన వెయ్యి మంది రైతులకు దాదాపు 5.5 కోట్ల రూపాయల రుణమాఫీకి ఆయన సహాయం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories