టీడీపీకీ డిపాజిట్లు కూడా రావు.. 30వేల మెజారిటీతో గెలుస్తా : ఆమంచి

టీడీపీకీ డిపాజిట్లు కూడా రావు.. 30వేల మెజారిటీతో గెలుస్తా : ఆమంచి
x
Highlights

వివేకానంద హత్యతో ఏపీ రాజకీయాలు మరింత ముదురుతోంది. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మరోవైపు ఎన్నికల సమయం కూడా కావడంతో ఇరు...

వివేకానంద హత్యతో ఏపీ రాజకీయాలు మరింత ముదురుతోంది. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మరోవైపు ఎన్నికల సమయం కూడా కావడంతో ఇరు పార్టీల అధినేతల మాటల తూటాలు, పొలిటికల్ హీట్ ను పెంచేస్తున్నాయి. కాగా తాజాగా దీనిపై చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మాట్లాడుతూ వైయస్ వివేకా హత్యను కావాలనే చంద్రబాబు, లోకేశ్ రాజకీయం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నారా చంద్రబాబు నువ్వో పిరికివాడివి, కేవలం పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, మమ్మల్ని ఎదుర్కోకునే దమ్ములేక అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. లక్ష మంది పోలీసులతో తమను అడ్డుకోవాలని చూసినా కానీ 30 వేల మెజారిటీతో చీరాల గడ్డపై మళ్లీ తానే గెలుస్తానని ఆమంచి కృష్ణ మోహన్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీకీ డిపాజిట్లు కూడా దక్కవన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories