కాంగ్రెస్‌కు మరో ఝలక్..!

కాంగ్రెస్‌కు మరో ఝలక్..!
x
Highlights

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీని మట్టికలిపేందుకు కంకణం కట్టుకున్నమహాకూటమి ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే కాగా

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీని మట్టికలిపేందుకు కంకణం కట్టుకున్నమహాకూటమి ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే కాగా మహాకూటమితో చేతులు కలుపుతారనే భావించినా మొత్తానికి ఎస్పీ,బీస్పీలు కాంగ్రెస్ పార్టీకి ఉహించని షాక్ ఇచ్చింది. యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులేకుండానే ఎస్పీ, బీఎస్పీ మాత్రమే కూటమిగా ఏర్పడి ఎన్నికల రణరంగంలో తాడోపెడో తెల్చుకోవాలని సిద్ధమయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ చిఫ్ అఖిలేశ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి శుక్రవారం ఢిల్లీలో మంతనాలు జరిపారు. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల లెక్కల గురించి చర్చించినట్లు ఇక మొత్తానికి సీట్ల సర్దూబాటు ఖరారైనట్లేనని ఈనెల 15 తారీకునా అధికార ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల వెల్లడించాయి. యూపీలో మొత్తం 80ఎంపీ సీట్లుండగా ఎస్పీ,బీఎస్పీ కలిసి పోటీలో దిగడంతో రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories