మే 23న చంద్రబాబు మాజీ కావటం ఖాయం: అంబటి

మే 23న చంద్రబాబు మాజీ కావటం ఖాయం: అంబటి
x
Highlights

ఏపీలో వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. బాబు దుష్టపరిపాలన అంతం చేయాలని ప్రజలు కోరుకున్నారని రాంబాబు...

ఏపీలో వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. బాబు దుష్టపరిపాలన అంతం చేయాలని ప్రజలు కోరుకున్నారని రాంబాబు అన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయం మే 23న స్పష్టం కానుందని అంబటి తెలిపారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ రౌడీయిజం చేసిందని ఆయన అన్నారు. పోలింగ్‌ పెరుగుదల ప్రభుత్వ వ్యతిరేకతను చాటి చెబుతోందని, అందుకే బాబుకు ఓటమి భయం వెంటడుతుందని అన్నారు.

మే 23న చంద్రబాబు మాజీ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయనకు గెలుస్తామన్న విశ్వాసం ఉంటే భయమెందుకు?. ఓటమి భయంతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేద్దామని ప్రయత్నిస్తున్నారని అన్నారు. మా పార్టీ నేతలపై టీడీపీ నేతలు దాడులు చేశారు. టీడీపీ నేతలే దాడులు చేసి తిరిగి మాపైనే నెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అంటారు. గెలిచాక కంట్లో కారం కొడతారని మహిళలకు తెలుసనని అందుకే బాబు రాక్షస పాలన అంతమొందించటానికి మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories