తెలంగాణ ఖజానాకు న్యూ ఇయర్ కిక్..

liquor sales
x
liquor sales
Highlights

పాత ఏడాడికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాది వెల్‌ కమ్ చెబుతూ మోగిన గ్లాసుల గలగలలు తెలంగాణ ఖాజానాకు భారీగా కాసులను నింపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క డిసెంబర్ చివరి రోజులోనే 6 వందల కోట్ల రూపాయల పైన మద్యం అమ్మకాలు జరిగాయి.

పాత ఏడాడికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాది వెల్‌ కమ్ చెబుతూ మోగిన గ్లాసుల గలగలలు తెలంగాణ ఖాజానాకు భారీగా కాసులను నింపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క డిసెంబర్ చివరి రోజులోనే 6 వందల కోట్ల రూపాయల పైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో ఇయర్ ఎండ్‌ సోమవారం ఒక్క రోజే 134 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడయ్యింది. జిల్లాలో వారిగా చూస్తే హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 19.5 కోట్లు, రంగారెడ్డి 15.30 కోట్లు, ఉమ్మడి వరంగల్‌ 18 కోట్లు, మేడ్చల్‌ జిల్లాలో 12 కోట్ల రూపాయల మేర మద్యం అమ్మకాలు జరిగాయి.

తెలంగాణలోని మందుబాబులు నూతన సంవత్సరానికే కిక్కెక్కేలా ఆహ్వానించారు. డిసెంబరు 31న ఏకంగా రూ. 133 కోట్ల మద్యాన్ని పొట్టలో పోసేసుకున్నారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు ఆదాయం భారీగా సమకూరింది. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు రూ. 50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. అయితే, సోమవారం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా రూ. 133 కోట్ల విక్రయాలు జరిగాయి. అంతేకాదు, డిసెంబరు చివరి వారంలో రూ.600 కోట్లకుపైగా విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 19.5 కోట్ల మద్యం అమ్ముడుపోగా, రంగారెడ్డిలో రూ.15.30 కోట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ. 18 కోట్లు, మేడ్చల్ జిల్లాలో రూ.11.90 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మొత్తంగా రూ. 20 వేల కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా ఒక్క డిసెంబరులోనే ఏకంగా రూ. 1,962 కోట్ల మద్యం అమ్ముడుపోవడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories