వైసీపీ గూటికి చేరిన భానుచందర్‌

వైసీపీ గూటికి చేరిన భానుచందర్‌
x
Highlights

ప్రముఖ సినీ నటుడు భానుచందర్ మొత్తానికి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పాదయాత్ర నేటితో ముగస్తున్న సందర్భంగా

ప్రముఖ సినీ నటుడు భానుచందర్ మొత్తానికి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పాదయాత్ర నేటితో ముగస్తున్న సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భాను చందర్ వైసీపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా భాను చందర్‌కు పార్టీ కండువా కప్పి పార్టీకి ఆహ్వానించారు. అనంతరం సినీ నటుడు భాను చందర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల రణరంగంలో ఏపీలో వైసీపీ పార్టీ జెండా ఎగరడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అలాగే పార్టీ అప్పగించిన భాధ్యతలను తప్పకుండా సమర్ధవంతగా నిర్వహిస్తానని అన్నారు. నిరంతరం ప్రజలకోసమే తపించే జగన్ లాంటి నాయకుడిని తాను ఎక్కడ చూడలేదని అన్నారు. జనంలో మమేకమై ప్రజల కష్టలను తన కష్ఠంగా బావివచే నాయకుడు వైయస్ జగన్ ఒక్కరునని అన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికల పోరులో జగన్ గెలుపొంది మరో 20 సంవత్సరాలపాటు జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories