మానవత్వం చచ్చిపోయింది .. కొడుకు మృతదేహాన్ని భుజాల పైన మోసుకెళ్ళిన తండ్రి ..

మానవత్వం చచ్చిపోయింది .. కొడుకు మృతదేహాన్ని భుజాల పైన మోసుకెళ్ళిన తండ్రి ..
x
Highlights

అధికారాల నిరక్ష్యం అనడం కన్నా మానవత్వం చచ్చిపోయింది అని చెప్పడం కరెక్ట్ .. బీహార్ లో తన కుమారుడు చనిపోతే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అక్కడి సిబ్బంది...

అధికారాల నిరక్ష్యం అనడం కన్నా మానవత్వం చచ్చిపోయింది అని చెప్పడం కరెక్ట్ .. బీహార్ లో తన కుమారుడు చనిపోతే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అక్కడి సిబ్బంది అంబులెన్సు కూడా ఇవ్వకపోవడంతో తన భుజాల పైన ఎత్తుకొని వెళ్ళడం బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది .. ఇక వివరాల్లోకి వెళ్తే తన కుమారుడి ఆరోగ్యం బాలేదని ఓ తండ్రి నలందలొని సదర్ సర్కార్ ఆసుపత్రిలో చేర్చాడు . చికిత్స పొందుతూ ఆటను చనిపోయాడు .. తన కుమారడు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్ళాలని ఆసుపత్రి సిబ్బందిని అడిగితే తమ వద్ద అంబులెన్సు లేదని చెప్పుకొచ్చారు . డబ్బులు పెట్టి ఆటోలో తీసుకు వెళ్లేందుకు కూడా అతని దగ్గర లేకపోవడంతో ఏమో చేయాలో తెలియక తన భుజాలపైన వేసుకొని తన కొడుకు మృతదేహాన్ని తీసుకువెళ్ళాడు .. రోడ్డు పైన అలా తీసుకు వెళ్తున్న అ తండ్రిని అందరు చూసి ఫోటోలు తీసారు కానీ ఎవరు ముందుకు రాకపోవడం కలిచివేసింది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories