జగన్ మండపేట సభలో ప్రమాదం.. 30 మందికి గాయాలు

జగన్ మండపేట సభలో ప్రమాదం.. 30 మందికి గాయాలు
x
Highlights

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. సభలో...

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. సభలో జగన్ మాట్లాడుతూ ఉండగా సమీపంలోని భవనం పిట్టగోడ కూలిపోయింది. ఈ ఘటనలో 30 మంది వరకు గాయాలయ్యాయి. అధిక సంఖ్యలో జనం ఎక్కడంతో భవనం కూలిపోయినట్టు సమాచారం. గాయపడిన వారిని హుటాహుటినా మండపేట ఆస్పత్రికి తరలించారు. కాగా గాయపడిన వారిలో ఒకరికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. చాలా దెబ్బలు తగలడంతో వారిని వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని భావిస్తున్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండటంతో వైసీపీ కార్యకర్తలు, నేతలు వెంటనే మండపేట ఆసుపత్రికి చేరుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories