రెండు హెలికాప్టర్లను ఢీకొట్టిన విమానం.. ముగ్గురి మృతి

రెండు హెలికాప్టర్లను ఢీకొట్టిన విమానం.. ముగ్గురి మృతి
x
Highlights

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లుక్లాలోని తెన్‌జింగ్‌ హిల్లరీ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అవుతుండగా సమ్మిట్‌ ఎయిర్‌కు చెందిన ఓ విమానం...

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లుక్లాలోని తెన్‌జింగ్‌ హిల్లరీ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అవుతుండగా సమ్మిట్‌ ఎయిర్‌కు చెందిన ఓ విమానం ప్రమాదవశాత్తూ అక్కడి హెలిప్యాడ్‌లో నిలిపి ఉంచిన రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విమానం లుక్లా నుంచి కాఠ్‌మండూకు ప్రయాణించాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories