డ్రైనేజీ శుభ్రం చేస్తూ.. ఊపిరాడక ముగ్గురు మృతి

డ్రైనేజీ శుభ్రం చేస్తూ.. ఊపిరాడక ముగ్గురు మృతి
x
Highlights

ముంబై థానేలోని ధోకాలి ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజీ శుభ్రం చేస్తూ ప్లాంట్‌లో ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్ర...

ముంబై థానేలోని ధోకాలి ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజీ శుభ్రం చేస్తూ ప్లాంట్‌లో ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన పశ్చిమ థానేలోని ధోకాలిలోని ప్రైడ్‌ ప్రెసిడెన్సీ లక్సేరియా నివాస సముదాయంలో చోటు చేసుకుంది. డ్రైనేజీని క్లీన్ చేసేందుకు 8 మంది మురుగును శుద్ధి చేసే ప్లాంట్‌లోకి దిగారు. 130 క్యూబిక్ మీటర్ల లోతు ఉన్న ఈ ప్లాంట్‌లో విషవాయువుల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అమిత్ ఫుహల్(20), అమన్ బాదల్(21), అజయ్ బంబుక్(24)గా గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిని రమ్మర్ పుహల్(30), విజేంద్ర హత్వల్(25), మంజిత్ విద్య(25), జస్బీర్ పుహల్(24), అజయ్ పుహల్(21)గా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories