2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన కీలకనేత!

2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన కీలకనేత!
x
Highlights

ఇటివల బొత్స ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో బొత్స సత్యనారాయణ తాను పోటీ చేసే నియోజకవర్గం, అలాగే రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు.

ఇటివల బొత్స ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో బొత్స సత్యనారాయణ తాను పోటీ చేసే నియోజకవర్గం, అలాగే రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లాంటి అమాయకుల వల్లే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని వైసీపీ సీనియర్ బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఖచ్చితంగా 100సీట్లకు పైగానే వస్తాయని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో హంగ్ వచ్చే ప్రసక్తే లేదని తెల్చేశాడు. 2019లో వైపీసీ అధినేత పూర్తి మెజార్టీతోనే ఏపీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారని బొత్స చెప్పారు. ఒకప్పడు తమ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను తోసిపుచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పడే అవే పథకాలను కాఫీ కొడుతుందని బొత్స తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గెలిస్తే మేం తెగా ఆనందపడ్డామన్నారు. చంద్రబాబు మాకు శత్రువు.. ఆయన ఓడిపోతే మాకు ఆనందంగా ఉండదా? అని బొత్స తెలిపారు. కాగా ఎట్టకేలకు బొత్స పోటీచేసే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి బరిలో దిగుతున్నాడో బొత్స స్పష్టం చేశాడు. తాను చీరుపుపల్లి నుంచే పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories