వారికి ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారు: వీహెచ్ ఆగ్రహం

వారికి ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారు: వీహెచ్ ఆగ్రహం
x
Highlights

గాంధీభవన్‌లో ఉత్తమ్ అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ప్రారంభమైంది. అయితే పార్టీలో కొత్త వారికి ప్రాధాన్యత ఇచ్చి పాత వారిని విస్మరిస్తే ఎలా అంటూ...

గాంధీభవన్‌లో ఉత్తమ్ అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ప్రారంభమైంది. అయితే పార్టీలో కొత్త వారికి ప్రాధాన్యత ఇచ్చి పాత వారిని విస్మరిస్తే ఎలా అంటూ వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్, ఆర్.కృష‌్ణయ్యకు ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే బీసీ సాధికారత కమిటీలు ఎందుకని ప్రశ్నించారు. ఆకుల లలితకి ఎమ్మెల్సీ ఉండగానే మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎందుకు అవకాశం ఇచ్చారని అన్నారు. అయినా ఆమె పార్టీ మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన ఫిరోజ్ ఖాన్‌కు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎలా అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు వీహెచ్.

Show Full Article
Print Article
Next Story
More Stories