టీడీపీకి తోట నర్సింహం గుడ్ బై..రేపు వైసీపీలో

టీడీపీకి తోట నర్సింహం గుడ్ బై..రేపు వైసీపీలో
x
Highlights

కాకినాడ ఎంపీ తోట నర్సింహం టీడీపీకి గుడ్‌‌ బై చెప్పారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న నర్సింహం కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత టీడీపీకి గుడ్ బై...

కాకినాడ ఎంపీ తోట నర్సింహం టీడీపీకి గుడ్‌‌ బై చెప్పారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న నర్సింహం కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత టీడీపీకి గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. రేపు వైసీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. తోట కుటుంబ సభ్యులు కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. టీడీపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కానీ పార్టీ తన శ్రమను గుర్తించలేదని తోట నర్సింహం ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చిందని, వైసీపీ నేతలు ఆదుకుంటామని భరోసా ఇచ్చారని తోట నర్సింహం తెలిపారు. కార్యకర్తలతో అన్ని విషయాలు చర్చించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నాకే టీడీపీని వీడుతున్నానని స్పష్టం చేశారు. తోట నర్సింహం సతీమణి వాణి పెద్దాపురం ఎంపీ టికెట్ కోరుకుంటున్నారు. ఈ దిశగా జగన్ నుంచి హామీ రావడంతోనే తోట నర్సింహం టీడీపీకి గుడ్ బై చెబుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories