వందశాతం వీవీప్యాట్లు లెక్కింపు: సుప్రీంలో చుక్కెదురు

వందశాతం వీవీప్యాట్లు లెక్కింపు: సుప్రీంలో చుక్కెదురు
x
Highlights

వంద శాతం వీవీప్యాట్లు లెక్కించాలన్న డిమాండ్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వంద శాతం వీవీప్యాట్‌ల లెక్కించాలని దాఖలైన...

వంద శాతం వీవీప్యాట్లు లెక్కించాలన్న డిమాండ్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వంద శాతం వీవీప్యాట్‌ల లెక్కించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని కోర్టు స్పష్టం చేసింది. వంద శాతం వీవీ ప్యాట్లను తనిఖీకి లోబడే ఉండాలని పలువురు సాంకేతి, నిపుణులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, ఇది న్యూసెన్స్ పిటిషన్‌ అని సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ విషయంలో తాము జోక్యం చేసుకునే ప్రసక్తలేని సుప్రీం స్పష్టం చేసింది. మరోవైపు ఎన్డీయేతర 21 విపక్ష పార్టీల నాయకులు మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్లనే మొదట లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించాలని.. ఈవీఎం, వీవీప్యాట్లలో నమోదైన ఓట్ల మధ్య తేడాలుంటే మాత్రం నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని ఈసీని కోరనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories