టీడీపీకి మరో షాక్‌.. వైసీపీలోకి మణిగాంధీ

టీడీపీకి మరో షాక్‌.. వైసీపీలోకి మణిగాంధీ
x
Highlights

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది అధికార పార్టీ టీడీపీకి మాత్రం షాక్స్ మీద షాక్స్ తగులుతూనే ఉన్పాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు టీడీపీకి గుడ్ బై...

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది అధికార పార్టీ టీడీపీకి మాత్రం షాక్స్ మీద షాక్స్ తగులుతూనే ఉన్పాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పి ఆయా పార్టీలో చేరారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బతగిలింది. తాజాగా కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ వైసీపీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోడుమూరులో పర్యటనలో ఈ సందర్భంగా జగన్ సమక్షంలో మణిగాంధీ మళ్లీ వైసీపీ కండువా కప్పి జగన్ పార్టీ కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అయితే గత2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన మణిగాంధీ రెండేళ్ల క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ టీడీపీలో చేరారు. అయితే కోడుమూర్ టిక్కెట్‌ను తనకే కేటాయిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూసిన మణిగాంధీకి నిరాశే మిగిలింది. కోడుమూర్ టిక్కెట్‌ని బి.రామాంజనేయులుకు కేటాయించింది. దీంతో పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న మణిగాంధీ పార్టీ మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా మణిగాంధీ మాట్లాడుతూ వైఎస్ జగన్‌ను ఏపీ సీఎం చెయ్యడం కోసం తాను ప్రచారం చేస్తానని ఎమ్మెల్యే మణిగాంధీ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories