సీఎం భార్య ఇంట్లో ఐటీ సోదాలు

సీఎం భార్య ఇంట్లో ఐటీ సోదాలు
x
Highlights

దేశంలో ఐటి దాడులు వూపందుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం రేపాయి. గురువారం ఏకకాలంలో 60 ప్రాంతాల్లో ఐటీ దాడులు చేసి సంచలనం సృష్టించారు.

దేశంలో ఐటి దాడులు వూపందుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం రేపాయి. గురువారం ఏకకాలంలో 60 ప్రాంతాల్లో ఐటీ దాడులు చేసి సంచలనం సృష్టించారు. ముఖ్యంగా సీని పరిశ్రమకు చెందిన ప్రముఖల ఇండ్లల్లో, తమ కార్యాలయాలల్లో ఐడీ అధికారులు సోదాలు చేశారు. కాగా కర్ణాటక సీఎం జేడీఎస్ కుమారస్వామి రెండో భార్య రాధిక, సినీ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, మరియు కన్నడ కంఠీరవ దివంగత రాజ్ కుమార్ ఇంట్లో, పునిత్ నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించడంపై ఇప్పడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. హీరో సుదీప్, కేజీఎఫ్ నటుడు యశ్, సినీ నిర్మాత విజయ్ ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక సీఎం కుమార స్వామి రెండో భార్య రాధిక నివాసంలో ఐటీ దాడులు నిర్వహించడంపై జేడీఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపుతోనే ఐటీ దాడులు చేపట్టారని జేడీ(ఎస్‌) నాయకులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories