మోడీజీ....భారీ మూల్యం తప్పుదు: చంద్రబాబు

మోడీజీ....భారీ మూల్యం తప్పుదు: చంద్రబాబు
x
Highlights

పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ధరల పెరుగుదలను నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కోల్‌కతాలో నిర్వహించిన విపక్షాల ఐక్యతా ర్యాలీలో ప్రసంగించిన చంద్రబాబు బెంగాలీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ధరల పెరుగుదలను నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కోల్‌కతాలో నిర్వహించిన విపక్షాల ఐక్యతా ర్యాలీలో ప్రసంగించిన చంద్రబాబు బెంగాలీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక రాష్ట్రాల హక్కు కాలరాసి వేధింపులకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా కేంద్రం అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు 2019లో దేశానికి కొత్త ప్రధాని రావడం ఖాయమని చెప్పారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైందని, ఫస్ట్ మీటింగ్ విజయవాడలోనూ, సెకండ్ మీటింగ్ కలకత్తాలో జరిగిందని చెప్పారు. ఇప్పుడు అమరావతిలో కూడా తాము పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేస్తామని, ప్రతి ఒక్కరూ హాజరుకావాలని నేతలను కోరారు చంద్రబాబు.

దేశాన్ని కాపాడుకోవాలనేదే మా అందరి లక్ష్యమన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే విపక్షాలుగా మేం ఏకం చేయాలనుకుంటున్నామని చెప్పారు. స్వాతంత్ర్య సంగ్రామానికి పశ్చిమబెంగాల్ దశాదిశ చూపిందన్నారు. విపక్షాల ఐక్యతకు గొప్ప వేదికను ఏర్పాటు చేశారంటూ తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీని ప్రశంసించారు ఏపీ సీఎం చంద్రబాబు. విభజించు పాలించు అనే రీతిలో బీజేపీ దేశాన్ని పాలిస్తోందని ఆయన ఆరోపించారు. రైతుల కష్టాలు కేంద్రానికి పట్టడం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థనూ కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసిందన్నారు. పెద్ద నోట్ల రద్దే అందుకు నిదర్శనమని చెప్పారు. మరోవైపు రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు దుయ్యబట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories