తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బీజేపీ కీలక నిర్ణయం..

తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బీజేపీ కీలక నిర్ణయం..
x
Highlights

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫలితాల ఇప్పుడు రాజకీయంగా దూమారం రేపుతోంది. ప్రతిక్షపార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంటర్ వ్యవహారంపై, తెలంగాణ ప్రభుత్వంపై...

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫలితాల ఇప్పుడు రాజకీయంగా దూమారం రేపుతోంది. ప్రతిక్షపార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంటర్ వ్యవహారంపై, తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో ధర్నాలు నిర్వహించింది. ఈ నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ కూడా ఇప్పుడు ఇంటర్ ఫలితాల విషయంలో తెలంగాణ సర్కార్‌ పై పెద్దఎత్తున్న పోరాటానికి సిద్దం అయింది. ఇంటర్ ఫలితాల్లో తప్పులకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు. ఈనెల 29 నుంచి అంటే రేపటి నుండి కె.లక్ష్మణ్ నిరవధిక దీక్ష చేయనున్నారు. బీజేపీ కార్యాలయంలోనే కె.లక్ష్మణ్ ఈ దీక్ష చేయనున్నట్టు తెలిసింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వారిని ప్రభుత్వం రక్షిస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. అయితే త్రిసభ్య కమిటీ నివేదిక పేరు చెప్పి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, అయితే, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

ఇటు ఇంటర్ బోర్డు వైఫల్యాలతో సుమారు 23 మంది విద్యార్థులు చనిపోవడం దారుణమన్నారు బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ఇంటర్ విద్య ఒక దందాగా మారిందని విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి ఇచ్చిన నివేదిక సంతృప్తిగా లేదన్న ఆయన గ్లోబరీనా వెనుక ఎవరున్నారో వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. ఈ నెల 29న అంటే రేపు ఇంటర్ బోర్దు వద్ద ధర్నా చేయనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories