బాబు పిలవకున్నా పని కట్టుకోని వెళ్లి ఏపి పరువు తీస్తున్నాడు ..

బాబు పిలవకున్నా పని కట్టుకోని వెళ్లి ఏపి పరువు తీస్తున్నాడు ..
x
Highlights

ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో బాబు తన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత రామచంద్రయ్య విమర్శించారు. ఈ రోజు...

ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో బాబు తన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత రామచంద్రయ్య విమర్శించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన అయన బాబుపై ఈ వాఖ్యలు చేసారు . కొన్ని గంటల్లో విడుదల అవనున్నా ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉండడం అయన జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దావా చేసారు ..

చంద్రబాబు హుదతనాన్ని పక్కనపెట్టి దేశంలో ఎవరు పిలవకున్నా ఈయనే పనిగట్టుకొని పక్కా రాష్ట్రాలకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ పరవు తీస్తున్నాడని అయన అభిప్రాయపడ్డారు . అసలు చంద్రబాబుకి విలువ ఎక్కడ లేదని ఆయన అన్నారు. అయన ఎంత తిరిగిన ప్రయోజనం మాత్రం ఉండదని ఎద్దావా చేసారు .

సుప్రీం కోర్టు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించడం నిజంగా సిగ్గు చేటన్నారు. చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ప్రజాసామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని రామచంద్రయ్య ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories