'ఓటమి భయం చంద్రబాబులో కనిపిస్తోంది':మంత్రి తలసాని

ఓటమి భయం చంద్రబాబులో కనిపిస్తోంది:మంత్రి తలసాని
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు మాటల్లో ఓడిపోతాననే భయం కనిపిస్తుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. టెక్నాలజీ ఛాంపియన్‌ అని చెప్పుకుంటున్న...

ఏపీ సీఎం చంద్రబాబు మాటల్లో ఓడిపోతాననే భయం కనిపిస్తుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. టెక్నాలజీ ఛాంపియన్‌ అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఈవీఎంలను ఎందుకు అనుమానిస్తున్నారని ప్రశ్నించారు. ఏపీపై ప్రేమ ఉంటే తెలంగాణలో ఉన్న ఆస్తులను అమ్మేసి వెళ్లిపోవాలని సూచించారు. పోలింగ్‌పై టీడీపీ డ్రామాలాడుతోందన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత పబ్లిసిటీ కోసమే చంద్రబాబు ఈసీని కలిశారన్నారు. ఏపీ ఎన్నికల్లో దాదాపు 42 వేల ఈవీఎంలు వాడితే అందులో 300 ఈవీఎంలలోనే సమస్యలు తలెత్తాయి. ఆ 300 ఈవీఎంలపైనే టీడీపీ ఆధారపడి ఉందా? అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబువి చిల్లర రాజకీయాలన్నారు. నోరు తెరిస్తే అన్ని అబద్దాలేనన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని దుయ్యబట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories