అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
x
Highlights

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలో ఫుడ్ ఫెస్టివల్ టార్గెట్‌గా ఓ ఆగంతకుడు కాల్పలకు ఒడిగట్టాడు. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు మృతి...

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలో ఫుడ్ ఫెస్టివల్ టార్గెట్‌గా ఓ ఆగంతకుడు కాల్పలకు ఒడిగట్టాడు. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సమ్మర్ ఫుడ్ ఫెస్టివల్‌గా పేరొందిన గిల్ రే ఫుడ్ ఫెస్ట్‌ ప్రతి ఏటా మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. నిన్న (ఆదివారం ) ఫెస్ట్ చివరి రోజున ఆగంతకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే మొదటగా పటాకులు పేలుస్తున్నారని అనుకున్న సందర్శకులు ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా జనం ప్రాణాలు కాపాడుకొనేందుకు పరుగులు తీశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories