దారుణం: కొడుకు అత్యాచారం చేస్తుంటే.. వీడియో తీసి బాధితురాల్ని బ్లాక్ మెయిల్ చేసిన తల్లి

దారుణం: కొడుకు అత్యాచారం చేస్తుంటే.. వీడియో తీసి బాధితురాల్ని బ్లాక్ మెయిల్ చేసిన తల్లి
x
Highlights

కొడుకు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన తల్లి.. కొడుకుకు వంత పాడిన తల్లి కథ ఇది. డబ్బుకోసం కొడుకు అత్యాచారాన్ని వీడియో తీసి.. దానితో బాధితురాలిని బెదిరించి...

కొడుకు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన తల్లి.. కొడుకుకు వంత పాడిన తల్లి కథ ఇది. డబ్బుకోసం కొడుకు అత్యాచారాన్ని వీడియో తీసి.. దానితో బాధితురాలిని బెదిరించి డబ్బు గుంజిన వైనం ఇది. ఈ సంఘటన చత్తీస్ గడ్ లో చోటు చేసుకుంది.

చత్తీస్ గడ్ బలోడా బజార్ కు చెందిన రైతు పొలం అమ్మగా ఆరు లక్షల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బు తన కూతురుకి ఇచ్చి జాగ్రత్త చేయమన్నాడు. కొన్ని రోజుల తరువాత డబ్బు కావాలని తండ్రి అడిగితే రెండు లక్షలు తెచ్చి ఇచ్చింది. మిగిలిన సొమ్ము కోసం ఆమెను గట్టిగా అడిగితే భోరుమని ఏడ్చింది. ఏం జరిగిందని ఆరా తీయగా ఆమె చెప్పిన విషయం విని హతాశుదయ్యాడా తండ్రి.

ఓ యువకుడు ఆమెతో స్నేహంగా ఉండేవాడు. అతను ఒకరోజు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆ యువకుని తల్లి ఆమెకు స్నాక్స్ పెట్టింది. అవి తిన్న వెంటనే ఆ యువతి స్పృహ తప్పింది. దీంతో ఆ యువకుడు ఆమె పై అత్యాచారం జరిపాడు. ఈ తతంగాన్ని ఆ యువకుని తల్లి వీడియో తీసింది. ఇక తరువాత ఆ తల్లీ కొడుకు కలిసి ఆమెను ఆ వీడియో చూపించి బెదిరించారు. దాంతో ఆ యువతి 4 లక్షలు వారికి ఇచ్చింది. ఇదిలా ఉండగా యా యువకుని సోదరి, ఆమె భర్త కూడా ఆ వీడియో చూపించి ఆమెను బెదిరించసాగారు. కానీ, తన దగ్గర డబ్బులు లేవని ఆమె చెప్పింది.

ఈ విషయాలన్నీ విన్న ఆ యువతి తండ్రి ఆమెను తీసుకుని పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి తల్లీ కొడుకులను అరెస్ట్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories