జగిత్యాలలో మళ్లీ దారుణం

జగిత్యాలలో మళ్లీ దారుణం
x
Highlights

జగిత్యాల జిల్లా తాటిపెల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు డిగ్రీ విద్యార్ధులు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. స్ధానికంగా ఉన్న ఓ...

జగిత్యాల జిల్లా తాటిపెల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు డిగ్రీ విద్యార్ధులు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. స్ధానికంగా ఉన్న ఓ ప్రయివేటు కళాశాలలో డిగ్రీ చదవుతున్న నవీన్‌, శ్రవణ్‌లు నిన్న రాత్రి మద్యం సేవించారు. తరువాత మాట మాట పెరగడంతో ఇరువురు కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో నవీన్ చనిపోగా ..శ్రవణ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. సరిగ్గా నెల రోజుల క్రితం ఇద్దరు పదోతరగతి విద్యార్ధులు మద్యం మత్తులో ప్రాణాలు తీసుకున్న ఘటన మరువక ముందే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories