యూపీ సీఎంపై సాధువులు గుస్సా

యూపీ సీఎంపై సాధువులు గుస్సా
x
Highlights

'అయోధ్య దీపోత్సవ్‌'లో రామాలయ నిర్మాణంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి ఏదైనా హామీ రాకపోతుందాఅని ఆశగా ఎదురుచూసిన సాధు, సంతులకు నిరాశే మిగిలింది....

'అయోధ్య దీపోత్సవ్‌'లో రామాలయ నిర్మాణంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి ఏదైనా హామీ రాకపోతుందాఅని ఆశగా ఎదురుచూసిన సాధు, సంతులకు నిరాశే మిగిలింది. కోట్లాది మంది హిందువులు ఆయోధ్యపై ఆందోళన చేస్తుంటే యోగి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం పార్లమెంటులో తక్షణం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.అయోధ్యనాథ్ ప్రసంగంపై రామజన్మభూమి ప్రధాన పురోహితుడు మహత్ సత్యానంద దాస్ స్పందిస్తూ, ఫైజాబాద్ జిల్లాకు అయోధ్య పేరు పెట్టాలన్న యోగి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కాగా పార్లమెంటులో చట్టం గురించి ఆయన నుంచి ప్రకటన వస్తుందని తాము ఆశించినప్పటికీ అలా జరగలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి చట్టం తేవాలని సత్యనంద స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories