రూ.3,999కే రెడ్ మీ స్మార్ట్ ఫోన్

Highlights

దేశ్‌కా స్మార్ట్‌ఫోన్‌' రెడ్ మీ 5ఏ మార్కెట్లో విడుదలైన కష్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో, అందుబాటు ధ‌ర‌తో అంద‌రి దృష్టినీ...

దేశ్‌కా స్మార్ట్‌ఫోన్‌' రెడ్ మీ 5ఏ మార్కెట్లో విడుదలైన కష్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో, అందుబాటు ధ‌ర‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ తొలిసేల్ డిసెంబ‌ర్ 7న మ‌ధ్యాహ్నం 12 గం.ల‌కు ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్ స్టోర్‌లో ప్రారంభం కానుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తన వినియోగదారులకోసం బహుమతి రూపంలో రూ.500కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వనున్న‌ట్లు నిర్ణ‌యం తీసుకుని, తొలి 50లక్షల రెడ్‌మి 5ఏ(2జీబీ 16జీబీ)ను రూ.4,999కే అందించనున్న‌ట్లు రెడ్‌మీ ఇండియా ప్ర‌క‌టించింది. చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీతో రిలయన్స్ జియో చేతులు కలిపింది. ఎవరైనా షియోమీ తయారు చేస్తున్న రెడ్ మీ 5ఏ ను కొనుగోలు చేస్తే వారికి రూ.1000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఇస్తున్నట్లు జియో ప్రకటించింది. బెటర్ టు గెదర్ ఆఫర్ లో భాగంగా రెడ్ మీ 5ఏ యూజర్లు రూ.1000ను అదనంగా పొందవచ్చన్న జియో షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ తెలిపారు. ఇందుకు రెడ్‌మీ 5ఎ వినియోగదారులు ఏడాది పాటు రూ.199తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
రెడ్‌మీ 5ఏ ఫీచర్లు
5 అంగుళాల హెచ్‌డీ తాకే తెర
స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌
2జీబీ ర్యామ్‌
16జీబీ అంతర్గత మెమొరీ, 128జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం
5 ఎంపీ, 13 ఎంపీ ముందు వెనుక కెమెరాలు
ఆండ్రాయిడ్‌ నోగట్‌, ఎంఐయూఐ 9 వెర్షన్‌
3000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Show Full Article
Print Article
Next Story
More Stories