ప్రియుడు మోసం చేయడంతో సెల్‌ టవర్‌ ఎక్కిన యువతి...

ప్రియుడు మోసం చేయడంతో సెల్‌ టవర్‌ ఎక్కిన యువతి...
x
Highlights

నల్లగొండ జిల్లా వలిగొండలో జ్యోతి అనే యువతి టవరెక్కింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగింది. యాదాద్రి జిల్లా భువనగిరి...

నల్లగొండ జిల్లా వలిగొండలో జ్యోతి అనే యువతి టవరెక్కింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగింది. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పల్లపు జ్యోతి, వలిగొండ మండల కేంద్రానికి చెందిన రావుల భాస్కర్ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ అన్నప్పుడు తనతో సరదాగా సమయం గడిపిన ప్రియుడు పెళ్లి మాట ఎత్తేసరికి దూరంగా ఉంటున్నాడు. పెళ్లి చేసుకోవాలని భాస్కర్‌ను గట్టిగా నిలదీయడంతో అందుకు అతడు నిరాకరించాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని యువతి వాపోయారు. ఇంకో పెళ్లికి సిద్ధపడుతున్నాడని ఆరోపిస్తూ.. ప్రియుడి ఇంటి ముందు గత మూడు రోజులుగా బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నా న్యాయం జరగడం లేదని మనస్తాపానికి లోనయ్యారు. ఆమె స్థానిక వెంకటేశ్వర థియేటర్ పక్కన ఉన్న సెల్ టవర్ ఎక్కారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories