బీజేపీకి నాలుగు సీట్లన్నా వస్తాయా?: హరీశ్ రావు సెటైర్లు

బీజేపీకి నాలుగు సీట్లన్నా వస్తాయా?: హరీశ్ రావు సెటైర్లు
x
Highlights

భారతీయ జనతా పార్టీపై హరీశ్ రావు సెటైర్లు కురిపించాడు. ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కనీసం 4సీట్లన్నా వస్తాయా? అని హరీశ్...

భారతీయ జనతా పార్టీపై హరీశ్ రావు సెటైర్లు కురిపించాడు. ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కనీసం 4సీట్లన్నా వస్తాయా? అని హరీశ్ రావు ప్రశ్నించాడు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో నిర్వహించిన రోడ్ షో లో హరీశ్ రావు పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ గెలిచే పార్టీ కాదని, ఒక్క రూపాయి పని కూడా చేసే పార్టీ కాదని విమర్శించారు. ఇన్నేండ్లు మన నెత్తిన కూర్చోని పరిపాలించిన కాంగ్రెసే పార్టీ హాయాంలో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగలేదని, రైతుల ఎన్ని అవస్థలు పడ్డారో, కరెంటు కోసం ఎన్ని ధర్నాలు చేశారని అదే నాలుగు కోట్ల ఆక్షాంలతో ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వ హాయంలో నిరంతర కరెంటును అందించిన ఘనత కేవలం టీఆర్ఎస్ దేనని ధీమావ్యక్తం చేశారు. వచ్చే వర్షాకాలం నాటికి దుబ్బాకకు గోదావరి నీళ్లు రావడం ఖాయమని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories