నిత్యానంద దేశం నుంచి పారిపోయినట్లేనా?

తనను తాను దేవుడుగా చెప్పుకునే స్వామి నిత్యానంద దేశం విడిచిపోయాడనే పుకార్లు షికారు చేస్తున్నాయి. చట్టం నుంచి...
తనను తాను దేవుడుగా చెప్పుకునే స్వామి నిత్యానంద దేశం విడిచిపోయాడనే పుకార్లు షికారు చేస్తున్నాయి. చట్టం నుంచి తప్పించుకునేందుకు ఆయన విదేశాలకు పారిపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కేమన్ దీవుల్లో నిత్యానందకు ఆశ్రయం దక్కిందని కొందరు చెబుతున్నారు. కొంతకాలం నుంచి నిత్యానంద ఆశ్రమంలో లేకపోవడంతో ఈ రకమైన పుకార్లు పుట్టుకొచ్చాయి.
నెల రోజులుగా నిత్యానందను చూడలేదని అక్కడి స్థానికులు చెబుతుండగా ఆయన శిష్యులు మాత్రం ఉత్తర భారతంలో పర్యటిస్తున్నారంటున్నారు. ఉత్తర భారత పర్యటనలో ఉన్న ఆయన త్వరలోనే మళ్లీ తిరిగివస్తారని చెబుతున్నారు. అయితే, నిత్యానందను వ్యతిరేకించే వారు మాత్రం లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తరహాలోనే ఆయన కూడా విదేశాలకు పారిపోయారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులేమో నిత్యానంద పాస్పోర్టు ఇటీవలే రద్దయిందని, ఆయన విదేశాలకు వెళ్ళే అవకాశం లేదని చెబుతున్నారు.
2010లో ఓ నటితో శృంగారం చేస్తున్నట్టుగా వీడియో ద్వారా వార్తల్లో నిలిచిన నిత్యానంద అప్పటి నుంచి వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. 40 ఏళ్ల నిత్యానంద అసలు పేరు రాజశేఖరన్. బెంగళూరు - మైసూరు హైవేపై ఉన్న బిదాది దగ్గర 20 ఏళ్ల క్రితం నిత్యానంద ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఓషో రజనీష్ ఫిలాసఫీ ఆధారంగా ఆయన ప్రవచనాలు ఉండేవి. అవే ఆయనకు ఎక్కువ సంఖ్యలో శిష్యులు పుట్టుకొచ్చేలా చేశాయి.
Bandi Sanjay: డీజీపీకి డెడ్లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్గౌడ్
13 Aug 2022 10:37 AM GMT