తండ్రీ కొడుకులు మరోసారి ప్రజలను మోసం చేయడానికి వచ్చారు

x
Highlights

తండ్రీ కొడుకులు మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గీలో...

తండ్రీ కొడుకులు మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ హాజరైన సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించిన ఉత్తమ్ నాలుగున్నరేళ్ళ పాటు తెలంగాణను దోచుకున్న కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మిట్టమధ్యాహ్నం ఎండలో ఇంత పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారంటే.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిసిపోయిందని, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తామని, డిసెంబర్‌ 11న వచ్చేది తమ ప్రభుత్వమేనని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories