దేశానికే తెలంగాణ దిక్సూచి కావాలి : కేటీఆర్

దేశానికే తెలంగాణ దిక్సూచి కావాలి : కేటీఆర్
x
Highlights

దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచి కావాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు...

దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచి కావాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు రేట్టింపు వేగంతో పనిచేయాలని కెటిఆర్ అన్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్దంలో గెలిచి సంబరంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు రానున్న భవిష్కత్‌లో మరిన్ని పోరాటాలకు ఆర్మీ జవాన్ల లాగా సిద్ధంగా ఉండలని కార్యకర్తలకు కెటిఆర్ పిలుపునిచ్చారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీట్ ది క్లబ్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందే ఇదే వేదికగా మాట్లాడుతూ డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లారి డిసెంబర్ 12న నేను వస్తాను అని చెప్పాను గెలిస్తే మళ్లీ మీడియా ముందుకు వస్తాను.. గెలవకపోతే మళ్లీ కెమెరాలకు ముందు రాను అని ఈ వేదిక మీద చెప్పాను అని గుర్తుచేశాడు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories