టీఆర్‌ఎస్ నేత దారుణ హత్య

టీఆర్‌ఎస్ నేత దారుణ హత్య
x
Highlights

వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో దారుణం జరిగింది. టీఆర్ఎస్‌ నాయకుడు నారాయణరెడ్డిని ప్రత్యర్ధులు హతమార్చారు. ఈ రోజు తెల్లవారుజామున పొలం...

వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో దారుణం జరిగింది. టీఆర్ఎస్‌ నాయకుడు నారాయణరెడ్డిని ప్రత్యర్ధులు హతమార్చారు. ఈ రోజు తెల్లవారుజామున పొలం దగ్గరకు వెళుతున్న ఆయనపై కర్రలతో దాడి చేసిన దుండగులు .. రాళ్లతో కొట్టి చంపారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత సుభాష్‌రెడ్డే ఈ హత్య చేయించాడంటూ నారాయణ రెడ్డి అనుచరులు విధ్వంసానికి దిగారు. సుభాష్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న పోలీసులు నారాయణ రెడ్డి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇరు వర్గాల నివాసాల దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. సుభాష్‌ రెడ్డి అనుచరులు కొందరు గత నెలలో టీఆర్ఎస్‌లో చేరారు .దీంతో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చెలరేగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories