ప్రముఖ టాలీవుడ్ గాయని ఇక లేరు

ప్రముఖ టాలీవుడ్ గాయని ఇక లేరు
x
Highlights

టాలీవుడ్ అలనాటి నేపథ్య గాయని కె.రాణి (75) గత రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. కళ్యాణ్ నగర్‌లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంటిలో ఉంటున్న రాణి శుక్రవారం...

టాలీవుడ్ అలనాటి నేపథ్య గాయని కె.రాణి (75) గత రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. కళ్యాణ్ నగర్‌లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంటిలో ఉంటున్న రాణి శుక్రవారం రాత్రి 9:10 గంటలకు తుదిశ్వాస విడిచారు. పది సంవత్సరాల వయసులోనే దేవదాసు చిత్రంలో ‘అంతాభ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా’ అంటూ విషాదకర పాటతో పాపులర్ అయిన రాణి. 9వ యేట సినీ నేపథ్యగాయనిగా అరంగేట్రం చేసిన రాణి 1951 నుంచి గాలివీటి సీతారామిరెడ్డిని వివాహం చేసుకునే వరకూ సుమారు 500 పాటలు పలు భాషల్లో ఆలపించారు. శ్రీలంక జాతీయగీతం ఆలపించిన ఘనత కూడా రాణి కి దక్కింది. "ఇన్నిసాయ్ రాణి" అని అప్పటి జాతీయ కాంగ్రెస్ నేత కె.కామరాఙ్ ఆమెని కీర్తించారు. భారత రాష్ట్రపతి భవన్‌లో అప్పటి రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ తదితరులను ఆమె తన గానామృతంతో ఓలలాడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories