పీలేరులో టీడీపీకి భారీ షాక్‌!

పీలేరులో టీడీపీకి భారీ షాక్‌!
x
Highlights

చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో టీడీపీకీ గట్టి షాక్ తగిలింది. తెలుగు తమ్ముళ్లు వరుసగా రాజీనామా బాట పట్టారు. పీలేరు నియోజకవర్గ మాజీ ఇన్ చార్జ్...

చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో టీడీపీకీ గట్టి షాక్ తగిలింది. తెలుగు తమ్ముళ్లు వరుసగా రాజీనామా బాట పట్టారు. పీలేరు నియోజకవర్గ మాజీ ఇన్ చార్జ్ మైనార్టీ నేత ఇక్బాల్ మహమ్మద్ రాజీనామా బాటాపట్టారు. ఇక్బాల్ తో పాటు మరో 20మంది తెలుగు తమ్ముళ్లు రాజీనామా చేశారు. 25సంవత్సరాలు తెదేపాకు సేవచేసి తను ఎంతో నష్టపోయానని తీవ్రదిబ్రాంతికి గురైయ్యారు. ఎన్నికల తరవాత తనని అన్ని విధాలుగా అదుకుంటామని సీఎం రమేష్ కూడా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాగా ఇప్పటివరకు తనను ఏ రకంగా కూడా ఆదుకోలేదని వాపోయారు. టీడీపీ నేత నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డిని టీడీపీలో చేర్చుకునేటప్పుడే తనకు నామినేటెడ్‌ పదవిని ఇస్తానని తరువాత చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. బీజేపీ పార్టీతో బంధం తెగిపోయాకనే ముస్లీంలపై తీరని ప్రేమ కురిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్బాల్ రాజీనామా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories