తనుశ్రీపై రాఖీసావంత్‌ షాకింగ్‌ కామెంట్స్‌...తనుశ్రీ నన్ను రేప్ చేసింది..

తనుశ్రీపై రాఖీసావంత్‌ షాకింగ్‌ కామెంట్స్‌...తనుశ్రీ నన్ను రేప్ చేసింది..
x
Highlights

బోల్డ్ టాక్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈ సారి తన మాటలతో కాకుండా ఓ షాకింగ్ కామెంట్స్‌తో...

బోల్డ్ టాక్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈ సారి తన మాటలతో కాకుండా ఓ షాకింగ్ కామెంట్స్‌తో హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఒకప్పుడు బెస్ట్‌ ఫ్రెండ్‌ కాస్త ఇప్పుడు ఎనిమిగా మారడం చర్చనీయాంశంగా మారింది. హాట్‌ హాట్‌ అందాలతో కుర్రకారును పిచ్చేక్కించిన ముద్దుగుమ్మల మధ్య మొదలైన మాటల యుద్ధం బీటౌన్‌ను షేక్‌ చేస్తోంది.

బాలీవుడ్‌లో కాక రేపుతున్న మీటూ వివాదంలో రోజుకో ట్విస్ట్‌ చోటు చేసుకుంటోంది. మీటూ విజిల్‌ బ్లోయర్‌ తనుశ్రీ దత్తాపై ఇప్పటికే అనేక ఆరోపణలు చేసిన ఐటమ్‌ గాళ్‌ రాఖీ సావంత్‌ తాజాగా మరో బాంబ్‌ పేల్చింది. తనుశ్రీకి బాలీవుడ్ స్టార్స్‌ అంతా సపోర్టుగా నిలుస్తుంటే రాఖీ చేసిన షాకింగ్‌‌ కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి.

తనుశ్రీ దత్తా పుష్కరకాలం క్రితం తనపై పలుమార్లు అత్యాచారం చేసిందని హాట్‌ బ్యూటీ రాఖీసావంత్‌ ఆరోపించడం ఇండస్ట్రీన్ని షేక్‌ చేస్తోంది. తన పట్ల పలు సార్లు నీచంగా ప్రవర్తించడంతో పాటు కిస్సులు కూడా పెట్టుకునేదని ఈ విషయాన్ని చెప్పడానికి తాను చాలా సిగ్గుపడుతున్నానని చెప్పిన రాఖీ ఓ అమ్మాయిని మరో అమ్మాయి రేప్ చేయడమేంటని అనుకోవద్దని 377 చట్టాన్ని ఒకసారి గుర్తుచేసుకోవాలని సూచించింది. ఇప్పుడందరి దృష్టి మీటూపైనే ఉందని ఇప్పుడు 'షీటూ' ఉద్యమం కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది.

అంతేకాక తనూశ్రీ దత్తా పైకి చూడ్డానికి మాత్రమే అమ్మాయని లోపల అన్నీ మగ బుద్ధులేనని ఫైరయ్యారు. తనను డ్రగ్స్‌ తీసుకోమని బలవంతపెట్టేదని రేవ్‌ పార్టీలో పొగాకును మద్యంలో కలుపుకొని తాగడం తనూకు అలవాటుందని చెప్పింది. తనూశ్రీ ఓ లెస్బియన్‌ అని చెప్పిన రాఖీ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చాలా మంది లెస్బియన్స్‌ ఉన్నారని వాళ్ల పేర్లు బయటపెట్టబోనంది. నార్కో టెస్ట్‌ నానా పటేకర్‌కి కాక తనూకి చేయాలని డిమాండ్‌ చేసింది. తాను తనుశ్రీపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన రాఖీ తనుశ్రీ తన శరీరంపై ఎక్కడెక్కడ చేతులు వేసిందీ కోర్టులోనే చెబుతానని రాఖీ స్పష్టం చేసింది. గతంలో తనపై లేనిపోని ఆరోపణలు చేసిందంటూ రాఖీ సావంత్ పై 10 కోట్లకు పరువు నష్టం దావా వేసిన తనూశ్రీ దత్తా న్యాయ పోరాటం చేస్తోంది. ప్రస్తుతం ఇద్దరి మద్య కోర్టులో పెద్ద వార్ జరుగుతుంది. ఇలాంటి సమయంలో రాఖీ సావంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడంపై తనూశ్రీ దత్తా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories