ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి
x
Highlights

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాంచీపురం జిల్లా అచ్చిరపాకం దగ్గర కారు-బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. రోడ్డుకు పక్కన...

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాంచీపురం జిల్లా అచ్చిరపాకం దగ్గర కారు-బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. రోడ్డుకు పక్కన ఆగివున్న కారును తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగం అధికంగా ఉండటంతో కారు ధ్వంసమైంది. చనిపోయిన వారిలో ఓ చిన్నారి సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories