తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
x
Highlights

సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురైంది. ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ...

సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురైంది. ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. రిజర్వేషన్లను పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య అత్యధికంగా ఉండటంతో రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును తెలంగాణ సర్కార్ కోరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 67 శాతం ఇవ్వాలని కోరాగా రిజర్వేషన్లు పెంచడం కుదరని పని అని అసలు రిజర్వేషన్లు 50శాతానికి మించరాదని తీర్పు వెలువరించింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు అమలకై పోరాటం చేస్తామని తెరాస సర్కార్ ఎన్నికల మేనిఫెస్టోలో హామిఇచ్చింది. అయితే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories