అక్క ఆస్తిపై కన్నేసిన తమ్ముడు...చంపి.. స్నానాల గదిలో దాచి..

అక్క ఆస్తిపై కన్నేసిన తమ్ముడు...చంపి.. స్నానాల గదిలో దాచి..
x
Highlights

ఆస్తి కోసం తోడబుట్టిన అక్కనే కడతేర్చాడు ఓ కిరాతక తమ్ముడు. మూడు రోజుల క్రితం అక్కను హత్య చేసి శవాన్ని బాత్ రూంలో ఉంచి పోలీసులకు కంప్లైంట్ చేశాడు....

ఆస్తి కోసం తోడబుట్టిన అక్కనే కడతేర్చాడు ఓ కిరాతక తమ్ముడు. మూడు రోజుల క్రితం అక్కను హత్య చేసి శవాన్ని బాత్ రూంలో ఉంచి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. కనిపించకుండా పోయిన మహిళను ఆమె ఇంట్లోనే చనిపోయిన స్థితిలో గుర్తించారు. పోలీసుల విచారణలో అసలు బండారం బయట పడింది. అక్కను హత్య చేసిన సిద్ధార్థ, అతని తల్లి నిర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు.

వరంగల్ కు చెందిన శివనందిని కొంత కాలం క్రితం భర్తతో గొడవపడి కొడుకుతో సహా కలిసి తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. మలక్ పేట ఈస్ట్ ప్రశాంత్ నగర్ లో తనకు ఆస్తిగా వచ్చిన ఇంట్లో ఉంటుంది. అక్క ఆస్తిపై కన్నేసిన తమ్ముడు ఎలాగైన దక్కించుకోవాలన్న పథకం పన్నాడు. అక్క అని కూడా చూడకుండా హతమార్చాడు. మృత దేహాన్ని బాత్ రూంలో పడవేశాడు.

అక్కను హత్య చేసిన విషయం బయటకు పొక్కకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన అక్క అదృశ్యమైందంటూ తండ్రి మైసయ్యతో కలిసి ఫిర్యాదు చేశాడు తమ్ముడు సిద్ధార్ధ. రెండు రోజుల నుండి మిస్సింగ్ కేసు ట్రేస్ కాకపోవడంతో సిద్ధార్ధ వ్యవహార శైలిపై పోలీసులకు అనుమానం కలిగింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాన్ని వెల్లగక్కాడు సిద్ధార్థ. ఆస్తి విషయంలో గొడవ రావడంతోనే తానే అక్కను చంపేశానని అంగీకరించాడు. సిద్ధార్థ ఇచ్చిన సమాచారంతో ఇంట్లో బాత్ రూంలో పడేసిన శివనందిని
డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

అక్కను హత్యచేసిన తమ్ముడు సిద్ధార్ధ వనపర్తి డివిజన్ ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆస్థి కోసం రక్త సంబంధాలు, బంధుత్వాలను సైతం వదిలేసి ఇలాంటి దురాఘతానికి పాల్పడటం అందర్ని కలచివేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories