తెలంగాణ కొత్త సీఎస్‌గా ఎస్.కె.జోషి

తెలంగాణ కొత్త సీఎస్‌గా ఎస్.కె.జోషి
x
Highlights

తెలంగాణ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా శైలేంద్రకుమార్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. 1984 బ్యాచ్...

తెలంగాణ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా శైలేంద్రకుమార్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జోషి.. ప్రస్తుతం నీటిపారుదల శాఖ ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం నేటితో ముగియనుంది.

ఐఐటీ రూర్కీలో 1977-1981 మధ్య కాలంలో ఇంజినీరింగ్(ఈసీఈ) చదివారు. ఐఐటీ ఢిల్లీ నుంచి పీజీ చేశారు. 2010లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఎస్‌కే జోషి 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా, తెనాలి, వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా సేవలందించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నీటి పారుదల శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి, వైద్యారోగ్య శాఖ, రెవెన్యూ శాఖల్లో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పని చేశారు. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం బరేలిలోనే కొనసాగింది. 6 నుంచి 8 తరగతుల వరకు తృతీయ భాషగా తెలుగును అభ్యసించారు. అనురాధతో శైలేంద్ర కుమార్ జోషికి వివాహమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories