ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

x
Highlights

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రాజకీయాలు కేసీఆర్‌ వర్సెస్‌ చంద్రబాబుగా నడుస్తాయని అన్నారు....

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రాజకీయాలు కేసీఆర్‌ వర్సెస్‌ చంద్రబాబుగా నడుస్తాయని అన్నారు. అయితే ఎవరు సక్సెస్‌ అవుతారో వేచిచూడాలని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదన్న ఆయన తాను పార్టీ మారేది లేదన్నారు. కేసీఆర్‌ను విమర్శించే కంటే క్యాడర్‌కు భరోసా, మనోధైర్యం ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఓడిపోయిన నాయకులకు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న నాయకులకు పార్టీ పెద్దలు అండగా నిలిచి కార్యాచరణ చేపట్టాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories