అష్టదిగ్బంధంలో శబరిమల అయ్యప్ప ఆలయం

అష్టదిగ్బంధంలో శబరిమల అయ్యప్ప ఆలయం
x
Highlights

కేరళలోని సుప్రసిద్ధ దేవాలయం శబరిమల వరుణుడి అష్టదిగ్బంధంలో కొనసాగుతోంది. శబరికి చేరుకునే మార్గాలన్నింటినీ భారీ వర్షాలు కుదిపేశాయి. చాలాచోట్ల రోడ్లు...

కేరళలోని సుప్రసిద్ధ దేవాలయం శబరిమల వరుణుడి అష్టదిగ్బంధంలో కొనసాగుతోంది. శబరికి చేరుకునే మార్గాలన్నింటినీ భారీ వర్షాలు కుదిపేశాయి. చాలాచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. పంబా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో శబరిమలకు చేరే దారులన్ని మూసుకుపోయాయి. ఈ నెల 14న నిరుపతరి ప్రత్యేక పూజల సందర్భంగా గుడికి వెళ్లే దారిలేక ప్రధాన అర్చకుడు అయ్యప్ప సన్నిధిలో ఉన్న అర్చకుడితో ఫోన్‌లో మాట్లాడి నిరుపతరి తంతును ముగించేశారు. శబరిమలను చేరేందుకు ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు మార్గాలూ జల దిగ్బంధంలో ఉన్నాయి. శని, ఆదివారాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 23 నుంచి 27 వరకు భక్తులను శబరికొండకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories