సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రాజెక్ట్కి తాజాగా మరోసారి తెరపైకి తీసుకొచ్చాడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సతీమణి...
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రాజెక్ట్కి తాజాగా మరోసారి తెరపైకి తీసుకొచ్చాడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా తీయనున్న మూవీ లాంచింగ్ ఈవెంట్ను దసరా (విజయదశమి) రోజు నిర్వహించనున్నట్లు తెలిపారు వర్మ. జనవరి నెలాఖరులో సినిమాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 19న తిరుపతిలో వెల్లడిస్తానని చెప్పారు.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను పెట్టాడు. నిక్కర్, బనియన్ వేసుకున్న ఆయన అచ్చం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లానే ఉన్నారు. ఏదో హోటల్ లో భోజనాలు వడ్డిస్తున్నారు. 'ఈ వ్యక్తి ఎక్కడున్నారో కనుక్కోవడానికి ఎవరైనా నాకు సహకరించగలరా? ఈయన ఆచూకీ తెలిపిన తొలి వ్యక్తికి లక్ష రూపాయల బహుమతి ఇస్తా' అంటూ ట్వీట్ చేశారు. ఎవరికైనా తెలిస్తే [email protected] మెయిల్ ఐడీకి వివరాలు పంపించాలని కోరారు.
Anybody who can track him can give his contact details via email at [email protected] ..The reward of 1 lak will be given to the first person who does that #NTRTRUESTORY pic.twitter.com/ShBakNJgEY
— Ram Gopal Varma (@RGVzoomin) October 13, 2018
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire