ప్రజాకూటమిదే విజయం

ప్రజాకూటమిదే విజయం
x
Highlights

తెలంగాణ ఎన్నికల రణక్షేత్రంలో హోరాహోరిగా పోటిగా జరిగిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమిదే విజయమని టీపీసీసీ వర్కింగ్ వర్కింగ్...

తెలంగాణ ఎన్నికల రణక్షేత్రంలో హోరాహోరిగా పోటిగా జరిగిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమిదే విజయమని టీపీసీసీ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కే తమ మద్దతు ప్రకటించారని తెలిపారు. తెలంగాణ ప్రజాకూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని స్పష్టం చేశారు. కొడంగల్ ప్రజల ఆత్మగౌరవం తప్పకుండా గెలుస్తుందని ప్రకటించారు. ఈ నెల 11వ తేదీన వచ్చే ఫలితాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనువిప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణాలో తిరిగి తెరాస ప్రభుత్వమే ఏర్పడవచ్చ్చని ఎగ్జిట్ పోల్ ఫలితాల వెల్లడించాయి. ఎన్నికలలో టీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు రావచ్చని మెజారిటీ సర్వేల అంచనా వేశాయి. అయితే పోలింగ్ 70 శాతం మించక పోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడొచ్చని మరికొన్ని సర్వేల అంచనా తెల్చేశాయి. చూడాలి డిసెంబర్ 11న తెలంగాణ గడ్డపై ఎజెండా ఎగురుతుందో చూడాలి మరి.!

Show Full Article
Print Article
Next Story
More Stories